మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు శుక్రవారము ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు.కొహీర్ మండల పరిధిలోని మద్రిలో గ్రామానికి చెందిన లబ్ధిదారురాలకు అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు అజీమ్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.