‘రైతుల నుంచి పాలను కొనుగోలు చేయాలి’
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ పరిశ్రమ వారు స్థానిక రైతుల నుంచి పాలను కొనుగోలు చేయకుండా మహారాష్ట్ర, కర్నాటక నుంచి పాలను దిగుమతి చేస్తోంది. దీంతో జహీరాబాద్ పాడి రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారని, అప్పులు చేసి పాడిపశువులు పెంచుకున్నామని, ఇప్పుడు పాలను అమ్మే మార్గం లేదని రైతులు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు.