Warangal Media Committee Formed
వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ జిల్లాకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కమిటీని 10 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా శ్రీరామ్ రామచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, ఎండి హుస్సేన్ పాషా, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల్ల సోమేశ్వరరావు, పెద్దపల్లి వరప్రసాద్, బొడిగ శ్రీనివాస్, బొల్లెపల్లి రాజు నియమితులయ్యారు.
ఈ కమిటీకి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి అయూబ్ అలీ మెంబర్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
అదనంగా, దక్షిణ మధ్య రైల్వే, టీజీఎస్ఆర్టీసీ ప్రతినిధులు మరియు సమాచార శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు.
కొత్తగా ఏర్పడిన ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
