సమస్యను పెద్దది చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ యత్నం
మూడు నెలల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం హామీ
నెంబరు డూప్లికేషన్ అంటే దొంగ ఓట్లు కాదన్న ఎన్నికల సంఘం
ఎదురుదాడికి దిగుతున్న భాజపా
గత ఎన్నికలప్పుడే నకిలీ ఓట్లపై భాజపా నేత సుబేందు ఫిర్యాదు
ఇప్పటికే అప్రతిష్ట పాలైన మమతా ప్రభుత్వం
తృణమూల్లో పెరుగుతున్న విభేదాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డుల (ఈపీఐసీ)నెంబర్ల డూప్లికేషన్ సమస్యను సత్వరం పరిష్కరించాలని తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పదిమంది నాయకుల బృందం ఈనెల 11న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలువనుంది. ఈపీఈసీ నెంబర్ల డూప్లికేషన్ విషయంలో ఎన్నికల కమిషన్, భాజపాలు కుమ్మక్కయ్యాయంటూ ఫిబ్రవరి 27న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజానికి గత పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు సుబేందు అధికారి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అరీజ్అఫ్తాబ్ను కలిసి రాష్ట్రంలో 16లక్షల దొంగ ఓటరు కార్డులు న్నాయని ఫిర్యాదు చేయడం గమనార్హం. అప్పుడు దీన్ని పట్టించుకోని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు నెంబర్ల డూప్లికేషన్పై నానా రగడ చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా యధావిధిగా ఎదురుదాడికి దిగుతుండటంతో రాష్ట్ర రాజకీయం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనతో పాటు పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మమతా బెనర్జీ ఈ ప్రతికూలతలనుంచి బయట పడేందుకు ఓటర్ల ఐ.డి. డూప్లికేషన్ను రాజకీయ అస్త్రంగా మలచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తన మేనల్లుడినుంచి చాపకింద నీరు రాజకీయాన్ని కూడా ఆమె ఎదుర్కొంటున్న నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోపక్క తృణమూ ల్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పకడ్బందీగా అడుగులు ముందుకేస్తుం డటంతో, తృణమూల్ కాంగ్రెస్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ అక్రమ వలసలు, రోహింగ్యాల దొంగవోట్లతో అధికారంలోకి రాగలగలుతున్నారన్న ఆరోపణలున్న నేపథ్యంలో అటువంటి ఓట్లు ఎక్కడ బయటపడతాయోనన్న భయం కూడా, మమతా బెనర్జీ ఎదురుదాడు లకు దిగేందుకు ఒక కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోయిన ఎన్నికల తర్వాత బెంగాల్లో జరిగిన హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐ.డి.కార్డుల గొడవ రాష్ట్రంలో రాజకీయాలను కుదిపేస్తున్నది.
పశ్చిమబెంగాల్లో బోగస్ ఓటర్ల బాగోతం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకే ఐ.డి. నెంబరు కలిగిన 25వేల వోటర్ కార్డులను గత నవంబర్లో ఎన్నికల కమిషన్ కనుగొంది. మొత్తం రాష్ట్ర అసెంబ్లీలో 294 స్థానాలుండగా, 11 నియోజకవర్గాల్లో ఇవి బయటపడ్డాయి.
గత నవంబర్ 11న రాష్ట్ర ఎన్నికల అధికారి మొత్తం 7.4కోట్ల ఓటర్ల జాబితాను విడుదల చేయగా, వీటిల్లో 16 లక్షల ఓటర్ల పేర్లను సరిచేయడమో లేక తొలగించడమో చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని దక్షిణ బోన్గామ్ (ఉత్తర 24`పరగణాల జిల్లా), నేపాల్ సరిహద్దులోని పానిటంకి సమీపంలోని మతిగర`నక్సల్బరి (డార్జిలింగ్) నియోజకవర్గాల్లో ఒకే ఐ.డి. నెంబరు కలిగిన ఓటరు కార్డులను కనుగొన్నారు. ఒకే నెంబరు కలిగిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) లేదా మల్టిపుల్ ఓటర్ ఐడీ కార్డులను ఉత్తర బోన్గామ్, మధ్యమ్గ్రామ్, రాజార్హట్`గోపాల్పూర్, కన్నింగ్ పుర్బా, బారుయ్పూర్ పుర్బా, పశ్చిమ కుర్సియాంగ్, సిలిగురి, ఫలకత ప్రాంతాల్లో కూడాకనిపించినట్టు ఎన్నికల అధికార్లు తెలిపారు. ఇటువంటి డూప్లికేట్ ఐ.డి.కార్డులను గుర్తించి తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఎన్నికల కమిషన్ అధికార్లు అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం ఒకే పేరుతో వున్న ఓటరు ఐ.డి. కార్డులను ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిశీలించి వీటిల్లో నకిలీలను తొలగించే ప్రక్రియను కమిషన్ చేపట్టింది. ఒకే ఐ.డి. నెంబరు పునరావృ త్తం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని అధికార్లు చెబతున్నారు. మరి ఎందుకు ఇట్లా వచ్చాయనేది తేలాల్సివుంది. ఇప్పటికైతే ఈ నియోజకవర్గాల్లో ఇటువంటి డూప్లికేట్ కార్డులను కనుగొన్నప్పటికీ, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి వుండకూడదనేం లేదని ఎన్నికల అధికార్లు అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 11న విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో 7.4కోట్ల ఓటర్లుండగా, 6.2లక్షల కొత్త పేర్లు జాబితాల్లో చేర్చగా, 4.5లక్షల పేర్లు తొలగించారు, 11.2లక్షల పేర్లలో తప్పులు సరిదిద్దారు.
ఇవి బోగస్ ఓట్లు కావు
రెండు కార్డులకు ఒకే ఈపీసీ నెంబరు వుండటం బోగస్ వోట్ల కిందికి రాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు అందరు ఓటర్లకు ప్రత్యేక ఈపీఐసీ నెంబర్లను కేటాయించడం ద్వా రా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఓటర్ల డేటాబేస్ను డి జిటలైజేషన్ చేయడానికి ముందు మ్యాన్యువల్గా వికేంద్రీకరణ పద్ధతిలో ఓటర్ల నమోదు చేసిన ప్పుడు జరిగిందని, దీన్ని మరో మూడు నెలల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఇక ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా రచ్చరచ్చ చేసే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ అంశానికి విపరీతమైన రాజకీయ కోణాన్ని ఆపాదిస్తూ, భాజపా, ఎన్నికల అధికార్లు కుమ్మక్కయి ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ పశ్చిమబెంగాల్ వీధులకెక్కడం తాజా పరిణామం. ‘గుజరాత్, హ ర్యానాల్లో కూడా పశ్చిమబెంగాల్లో మాదిరిగానే డూప్లికేట్ ఈపీఐసీ నెంబర్లు ఇ చ్చారు. ఆవిధంగా ఆన్లైన్లో బోగస్ ఓటర్లను నమోదు చేశారంటూ’ ఆరోపణలకు దిగారు. మహారాష్ట్ర, ఢల్లీిల్లో ప్రతిపక్ష పార్టీలు వీటిని గుర్తించలేదు. కానీ మేం గుర్తించామంటూ ఆమె గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం మళ్లీ స్పందించింది. ‘‘ఈపీఐసీ నెంబర్లు ఒకటే ఉన్నప్పటికీ, పోలింగ్ బూత్, నియోజకవర్గం తదితర వివరాలు భిన్నంగా వుంటాయి కనుక ఓటర్లు తమకు కేటాయించిన బూత్ల్లో నిరభ్యంతరంగా ఓటు చేయవచ్చు’ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదిలావుండగా బీజేపీ పశ్చిమ బెంగాల్ కో`ఇన్చార్జ్ మాలవ్యా, త్రిణమూల్పై ఎ దురుదాడికి ది గారు. మమతా బెనర్జీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కేవలం ఓటర్లను తప్పు దోవ పట్టించేందుకే ఆమె రాజకీయం చేస్తునారంటూ ఆరోపించారు. అంతేకాదు మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకుకోసం అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చినవారు మరియు రోహింగ్యాలకు నకిలీ ఓటర్ ఐ.డి.కార్డులు ఇప్పించారని అటువంటి దొంగ ఓటర్ల పేర్లను తొలగించాలని మాలవ్యా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు భాషాపరమైన మైనారిటీలు, మతువా వర్గానికి చెందిన హిందూ వలసదార్ల ఓట్లను తొలగించాలని చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నాలనువమ్ము చేయాలని కూడా కమిషన్ను ఆయన కోరారు. బంగ్లాదేశ్లో నిరంతరం జరుగుతున్న దాడులు, హింసాకాండ నేపథ్యంలో అక్కడినుంచి పారిపోయిన మతువా వర్గానికి చెందిన హిందు వులు బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
తృణమూల్లో విభేదాలు
ఇదిలావుండగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఫిబ్రవరి 27న పార్టీ కేంద్రకార్యాలయంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కొత్త ఓటర్ల జాబితాను సమీ క్షించడం ఈ సమావేశం ప్రధాన అజెండా. అయితే ఈ సమావేశానికి పార్టీ అఖిలభారత ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ గైర్హాజరు కావడం పార్టీలో అంతర్గత రాజకీయ విభేదాలను మరోసారి బయటపెట్టాయి. ఈ సమీక్ష ద్వారా ఓటర్ల లిస్ట్లో అవకతవకలు జరిగాయని నిర్ణయించి ప్రజల్లోకి వెళ్లాలన్నది వ్యూహం. విచిత్రమేమంటే ఈ కమిటీ పేర్లలో మొదటి స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభ్రతా బక్షి పేరుండగా, రెండో స్థానంలో మాత్రమే తనపేరుండటం అభిషేక్ బెనర్జీ కి నుకకు కారణమని ఒక్కసారి వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఇది పెద్ద చర్చనీయాంశం కావడంతో, మమతా బెనర్జీ తెలివిగా, ఇటీవల నేతాజీ ఇండోర్ స్టేడి యంలో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి అభిషేక్ బెనర్జీ చేసిన ప్రసంగాన్ని బహిరంగంగా ప్రశం సించడం ద్వారా ఊహాగాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగారు. పార్టీలో కొందరు ఈ తాజా పరిణామాలను తక్కువ చేసి చూపడానికి యత్నిస్తున్నారు. కానీ ఓటర్ల జాబితాకు సంబంధించిన పనులన్నీ టీఎంసీ కేంద్రకార్యాలయంలోనే జరగాలని మమతా బెజర్జీ కచ్చితమైన ఆదేశాలి చ్చిన నేపథ్యంలో, పార్టీలో రాజకీయాల గతిశీలతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీలోని మరొక వర్గం పేర్కొంటున్నది. అయితే అభిషేక్ అనుకూల వర్గాలు మాత్రం ఆయన సొంత ని యోజకవర్గమైన డైమండ్ హార్బర్లో నిర్వహిస్తున్న ‘శేబాష్రే’ పేరిట నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలు చివరి దశలో వుండటమే ఆయన గైర్హాజరుకు కారణమని సమర్ధిస్తున్నాయి. ఫిబ్రవరి 27న కోల్కతాలో ఓటర్ల జాబితాపై కీలక సమావేశమున్నప్పటికీ అభిషేక్ బెనర్జీ, డైమండ్ హార్బర్ లో నిర్వహిస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గనడం గమనార్హం.
వర్చువల్ సమావేశానికి యత్నాలు
ఇదిలావుండగా పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర కమిటీలు, జిలా అధ్యక్షులు, సంస్థాగత నాయకులతో వర్చువల్ సమావేశాన్ని మార్చి 15న నిర్వహించడానికి డైమండ్ హార్బర్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త పద్ధతిని తీసుకురావడంతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీన్ని రాష్ట్రంలోని దిగువస్థాయి నాయకులు తమకు సౌకర్యవంతమైన పద్ధతిగా భావించే వీలు ఏర్పడిరది. మరి మమతా బెనర్జీ ఇటువంటి సమావేశాలను నిర్వహించినప్పుడు ఆయా నాయకులు వ్యక్తిగతంగా హాజరుకావడం తప్పనిసరి! ఈ నేపథ్యంలో పార్టీలో రెండు కేంద్రస్థానాలు కొనసాతున్నాయన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కాగా ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా సమీక్షా బాధ్యతలను వివిధ నాయకులకు అప్పగించడం మరో పరిణామం. ఈ వికేంద్రీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షీ దక్షిణ కోల్కతాకు, అభిషేక్ బెజర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లాలో సమీక్షకు బాధ్యత వహి స్తారు. పార్టీలో క్రమంగా కేంద్రీకృత వ్యవహారశైలి, వికేంద్రీకృతంగా మారుతున్నదనడానికి ఇది ఉదాహరణగా కొందరు పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుబ్రతా బక్షీ నేతృత్వంలోని కమిటీ బృందం రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని కలిసి, ఓటర్లకు ప్రత్యేక ఐ.డి. ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని కోరారు. రాజకీయ పార్టీలు నియమించే బూత్ లెవెల్ ఆఫీసర్ల సమక్షంలో పారదర్శకంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇవ్వడం గమనార్హం.