గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల సునీత-మహేందర్ గౌడ్ దంపతుల కుమారుడు వేముల సాయి చరణ్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) హన్మకొండ, వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గౌడ విద్యార్థుల ప్రతిభ పురస్కార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవార్డుకు వేముల సాయి చరణ్ గౌడ్ ఎంపికైనాడు. కాగా ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ లో నిర్వహించిన గౌడ ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో గోపా హన్మకొండ జిల్లా అధ్యక్షులు..కాకతీయ యూనివర్సిటీ ఈసీ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ దంపతులు, మరియు హన్మకొండ గోపా గౌరవ అధ్యక్షులు..గౌడ ప్రతిభా పురస్కార్ ప్రోగ్రాం కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు, మెమొంటో ఇచ్చి, ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సాయి చరణ్ గౌడ్ మాట్లాడారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు కష్టపడి చదువుతానన్నారు.