కూకీ మిలిటెంట్లతో మణిపూర్‌లో అశాంతి

సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మిలిటెంట్లు

వీరు మనదేశ పౌరులు కాదు

మయన్మార్‌ నుంచి వచ్చి కూకీ ప్రజలపై ఆధిపత్యం

మత్తుమందుల అక్రమరవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు వీరి నిత్యకృత్యం

మైతేయీల మతసంప్రదాయాలను అడ్డుకుంటున్న కూకీలు

సుప్రీంకోర్టు జడ్జినే బార్‌ అసోసియేషన్‌లోకి అనుమతించని వైనం

మణిపూర్‌లో శాంతి ఎండమావేనా?
హైదరాబాద్‌,నేటిధాత్రి:
మణిపూర్‌లో మైతేయి, కూకీల మధ్య హింసాకాండ జరిగి మే 3తో సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఇంపాల్‌, చురాచంద్‌పూర్‌, కంగ్‌పోక్పీ జిల్లా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల చేశారు. ఈ సందర్భంగా మైతేయి వర్గానికి చెందిన సామాజిక సంస్థ ‘కోఆర్డినేటింగ్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇన్‌టిగ్రిటీ’ మే 3న ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అన్ని పనులు మానుకొని మరీ ఈ సదస్సుకు రావాలని పిలుపునివ్వడంతో, ఎక్కడ ఏవిధమైన అల్లర్లు జరగకుండా పోలీసులు డేగ కళ్లతో నిఘాను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో కూకీ మెజా రిటీ ప్రాంతాల్లో కూకీ విద్యార్థి సంఘం ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ జోమీ స్టూడెంట్స్‌’ బంద్‌కు పిలుపుని చ్చింది. అంతేకాదు చురాచంద్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ‘ఇండీజినియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం’ ఏ ర్పాటుచేసిన ఈవెంట్‌లో పాల్గనాలని ఈ విద్యార్థిసంఘం కూకీలకు పిలుపునిచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన హింసాకాండకు నిరసనగా ప్రజలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని కూడా ఈ సంఘం కోరింది. మే 2023 నుంచి ఇంపాల్‌ లోయ వాసులైన మైతేయీలు, చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నివసించే కూకీ`జో గ్రూపుల మధ్య జరిగిన హింసాకాండలో 240 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేలకు పైగా గాయపడ్డారు. మరో 60వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడం ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ గత ఫిబ్రవరి 9న రాజీనామా చేయడంతో, కేంద్రం అదేనెల 13వ తేదీనుంచి మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన విధించింది. ఇటీవల మైతేయీ, కూకీ తెగలకు చెందిన పౌరహక్కుల సంఘాల నాయకులు మరియు నా గా, మైతేయీ, కూకీ తెగలకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య చర్చలకు ప్రోత్సహించి నా పలితం లేదు.
క్యాన్సర్‌లా పరిణమించిన కూకీ మిలిటెన్సీ
సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (ఎస్‌ఓఓ) కింద కూకీ మిలిటెంట్‌ గ్రూపుల కార్యకలాపాలు ఇప్పుడు మణిపూర్‌ను క్యాన్సర్‌ రోగంలాగా పీడిస్తున్నాయి. నిజానికి ఈ ఒప్పందం కూకీ, మైతేయీ తెగల మధ్య శాంతి స్థాపనకోసం ఉద్దేశించింది. అయితే ఈ ఒప్పందాన్ని అడ్డంపెట్టుకొని, కూకీ మిలి టెంట్లు, కూకీ ప్రజల గ్రామాల్లో తిష్టవేసి, ప్రభుత్వ అధికార వ్యవస్థను ఎంతమాత్రం లెక్కచేయ కుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి ఈ కూకీ మిలిటెంట్లు భారతీయులు కా దు. మయన్మార్‌నుంచి సరిహద్దులు దాటి మనదేశంలో ప్రవేశించి కూకీ తెగల ప్రజలు నివసిం చే పర్యత ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారని చెప్పాలి. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ ప్రాంతాల్లో నివసించే కూకీ తెగల ప్రజలతో కూడిన ‘కూకీలాండ్‌’ ఏర్పాటు వీరి ప్రధానడిమాండ్‌. నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఓ ఒప్పందాన్ని ఖాతరు చేయడంలేదు. బలవంతపు వసూళ్లు, ఆయుధాల అక్రమరవాణా, వేధింపులకు పాల్పడటం వీరికి నిత్యకృత్యమైంది. ఒకవిధం గా చెప్పాలంటే 2023 మే నెలలో రెండు తెగల మధ్య హింస ప్రజ్వరిల్లడానికి ముందే వీరు ఇటువంటి కార్యకలాపాలు యదేచ్ఛగా నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి కూడా వీరిని ప్రోత్సహించినట్లవుతోంది. ఒక్కోసారి వీరు పాల్పడుతున్న స్థానిక నేరాలు, దేశ భద్రతకు ముప్పుగా మారుతుండటం వర్తమాన చరిత్ర.
మిలిటెంట్ల కాల్పులతోనే హింస ప్రారంభం
2023 మే నెలలో ప్రజ్వరిల్లిన హింస నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఎస్‌ ఒప్పందాన్ని ఉల్లం ఘించి, మైతేయీ గ్రామాలపై కాల్పులు జరపడంతో ప్రారంభమైంది. అప్పుడు మైతేయీ ప్రజ లు తమకు అందుబాటులో ఉన్న సంప్రదాయ తుపాకులతో ఎదురుదాడులకు దిగడంతో హింస తీవ్రరూపం దాల్చింది. తర్వాత గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయుధాలను అప్పగించాలని కో రడంతో, మైతేయీ ప్రజలు తమవద్ద వున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. కానీ కు కీ తెగలవారు కొద్ది మంది మాత్రమే ఆయుధాలు అప్పగించడంతో ఇప్పటికీ వారివద్ద అధునాత న అయుధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రామరక్షక దళాలుగా వున్న కూకీల చేతిలో ఇటువంటి ఆయుధాలున్నాయని మైతేయీలు ఆరోపిస్తున్నారు.
ఉన్నతస్థాయివారికీ ఇబ్బందులు
ఇక్కడ కొనసాగుతున్న అరాచక పరిస్థితి ఉన్నతస్థాయికి చెందిన వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నది. ఉదాహరణకు ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.కోటేశ్వర్‌ (ఈయన మైతేయీ తెగకు చెందినవారు)ను చురాచంద్‌పూర్‌ స్థానిక బార్‌ అసోసియేషన్‌లోకి ప్రవేశిం చకుండా అడ్డుకున్నారు. నిజానికి ఈ సంఘటన స్థానిక లీగల్‌ మరియు పౌర హక్కుల సంఘాలను నిర్ఘాంతపోయేలా చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తిని కేవలం మైతేయీ తెగకు చెందిన వాడన్న కారణంగా ఈవిధంగా అనుమతించకపోవడానికి మించిన అ రాచకం మరేదైనా వుంటుందా? ఇది మిలిటెంట్లు చేసిన పనికాదు. చట్టం, రాజ్యాంగం బాగా తెలిసిన వారు పాల్పడిన చర్య.
మైతేయీలపై ఆంక్షలు
ఇదిలావుండగా మైతేయీ తెగల ప్రజలు ఏటా ఏప్రిల్‌ నెలలో ‘తాంగ్‌జిల్‌ పర్వతం’పైకి తీర్థయా త్రకు వెళ్లి అక్కడ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని తరాలుగా ఈ ఆచారాన్ని మైతేయీలు పాటిస్తున్నారు. అయితే కూకీ`జో తెగకు చెందిన ఆరు సంస్థలు ఈ యాత్ర జరుపకూడదని మైతేయీలకు హెచ్చరికలు జారీచేశాయి. ఇది మైతేయీ తెగ ప్రజల సాంస్కృతిక హక్కుపై నేరుగా జరిపిన దాడి! రాజ్యసభ ఎం.పి. తితులార్‌ కింగ్‌ సనజౌబా లీషిం బా తీవ్రంగా ఖండిరచారు. పౌరహక్కుల సంఘాలు కూడా కూకీ తెగల వ్యవహారశైలిని తీవ్రంగానిరసించాయి. కూకీాజో తెగకుచెందిన థాన్‌లాన్‌ వింగ్‌జాజిన్‌ వాల్టే హింస ప్రారంభమైన తొలినాళ్లలో తీవ్రంగా గాయపడ్డారు. కోలుకున్న తర్వాత ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రెండు తెగల మధ్య శాంతి సుస్థిరతలు నెలకొనాల్సిన అవసరం వున్నదని చెప్పడంతో శాంతిపై ఆశలు చిగు రిరించాయి. కొద్దిరోజుల తర్వాత విచిత్రంగా ఆయన మాటమార్చి ‘ప్రత్యేక పాలన’ మాత్రమే మణి పూర్‌లో శాంతికి దోహదం చేస్తుందని మరో వీడియో విడుదల చేయడంతో కూకీ మిలిటెంట్లు ఆయనచేత అలా బలవంతంగా చెప్పించారన్న సంగతి స్పష్టమైంది. కూకీ తెగలో ఉదారవాదుల ను మిలిటెంట్లు తమ నియంత్రణలో వుంచుకుంటున్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ.ఏప్రిల్‌ 21న కాంగ్‌పోక్పీ జిల్లా ఎస్‌.పి. ఆఫీస్‌ నుంచి ఒక ప్రకటన వెలువడిరది. కె.పొన్‌లెన్‌ గ్రామంలో, కాంగ్‌చుప్‌ ఏరియా ప్రొటెక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (కేఏపీడీసీ) ఏప్రిల్‌ 30న ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ స్థానిక సివిల్‌ పోలీసులు, మణిపూర్‌ రైఫిల్స్‌ (ఎంఆర్‌), ఇండియా రిజర్వ్‌ బెటాలియన్లను ఆదేశిస్తూ జారీచేసిన ప్రకటన ఇది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూకీ ఇన్పీ తెగవారు.
రాష్ట్రపతి పాలనతో పరిస్థితి అదుపు
గత ఫిబ్రవరిలో రాష్ట్రపతిపాలన విధించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పువచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్దేశాలున్నప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటికే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. తెగలమధ్య అనుమానాలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర సంస్థలు మౌనాన్ని పాటించడం కూడా ప్రజల్లో ఒకరమైన అస్పష్టత కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే మణిపూర్‌ తన ‘ఉనికి’ కోసం పోరాడుతోంది. ముఖ్యంగా కూకీ మిలిటెంట్ల కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల అక్రమర వాణా, తత్సంబంధిత హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వీరి ప్రభావం పౌరసమాజం, రాజకీయాలు, శాంతిభద్రతలు, సాం స్కృతిక సంస్థల పై తీవ్రంగా వుంటోంది. తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం తాత్సారం చేసే కొద్దీ, ఈ కూకీ మిలిటెంట్లు మరింత బలపడతారు. మతసహనం పాటింపులో పక్షపాత వైఖరి అనుసరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇది ప్రజాస్వామ్య సమర్థకుల్లో విశ్వాసాన్ని దె బ్బతీస్తుంది. వాస్తవానికి మైతీయీలు, కూకీలు పరస్పరం శాంతినే కోరుకుంటున్నారు. కానీ సమస్యల్లా మిలిటెంట్లతోనే! ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతిపాలన పరిపాలనా పరంగా ఒక సానుకూల దశగా వుండాలి. ముఖ్యంగా శాంతి సుస్థిరతలు నెలకొల్పేదిగా, తెగల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దోహదపడేదిగా వుండాలి. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడే ముష్క రులను నియంత్రించాలి. తద్వారా కొత్త ప్రభుత్వం సక్రమంగా పాలన కొనసాగించే వాతావరణాన్ని కల్పించగలగాలి. ఇది d సాధించేవరకు, మణిపూర్‌ను ‘చట్టం’ పాలిస్తుందా లేక తుపాకుల ఆధిపత్యం కొనసాగుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోక తప్పదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!