Training for Booth Level Officers
బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పైన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ప్రత్యేక శిక్షణ అధికారులచే నిర్వహించడం జరిగింది. ఈశిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహశీల్దార్ బి.రాజేశ్వరి హాజరై బూత్ లెవల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో గిర్ధవార్లు రాజ్ కుమార్, కమలేశ్వర్, గ్రామ పాలన ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
