గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు

– 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయి
– డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కేసులలో స్వాధీన పరచుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో సిరిసిల్లలోని రగుడు స్టేజి వద్ద తగలబెట్టారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలని జిల్లా ఎస్పీ అన్నారు. యువత మత్తుకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని పేర్కొన్నారు .గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పిడియాక్ట్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ యాదగిరి, టౌన్ సీఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *