ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా…

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా

పావుశెట్టి సునీల్ 7వ వార్డు అభ్యర్థి

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని 7వ వార్డులో పావుశెట్టి సునీల్ విస్తృత ప్రచారం నినాదాలతో ఉత్సాహంగా సాగింది.ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.తాగునీరు,డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానన్నారు.వార్డు అభివృద్ధికి సమిష్టిగా పని చేస్తామని తెలిపారు.
ప్రజల మద్దతే తన బలమని ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.ప్రచారంలో నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించండి- వెలిచాల రాజేందర్ రావు…

కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించండి- వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

 

తొమ్మిదో డివిజన్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పడిశెట్టి వసంత లక్ష్మినీ అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్ గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లోని తోమ్మిదవ డివిజన్ కోతిరాంపూర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. టిఆర్ఎస్, బిజెపితో సాధ్యం కాదని వారితో ఏపని కాదని రాజేందర్రావు పేర్కొన్నారు. వారికి ఓటు వేస్తే వృధానేనని తెలిపారు. గల్లిగల్లిలో ఏపని చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా పడిశెట్టి వసంతలక్ష్మిని ఆశీర్వదించి అండగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, గడ్డం విలాసరెడ్డి, పడిశెట్టి భూమయ్య, మునిపల్లి ఫణిత, శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version