ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు సైలెన్స్ డేగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
తెలిపారు. ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, కాలనీలు వార్డుల్లో సంచరించరాదని సూచించారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.
