విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ సంకీర్త్….

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు – జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీములు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.

ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు పూర్తిగా నిషేధం.

శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేయరాదు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించబడతారు.
ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతి మరియు వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే నిర్వహించాలి.
ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version