ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్యమే మహాభాగ్యమని తల్లి శిశు ఆరోగ్య టీకాలు పారిశుభ్రత పై దృష్టి అవసరమని ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన ఇచ్చారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులో సేవలు తెచ్చిందని వ్యాధి నివారణకు అవగాహన కీలకమని ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఏ వ్యాధి కైనా గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు మాట్లాడారు
ఈ కార్యక్రమంలో డాక్టర్స్ హాస్పిటల్ స్టాప్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు
