ఛలో…‘చార్‌ధామ్‌’.. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్…

ఛలో…‘చార్‌ధామ్‌’.. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్…

మన జీవిత పుస్తకంలో ‘చార్‌ధామ్‌’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్‌ధామ్‌’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి…

అంటే నాలుగు క్షేత్రాలని అర్థం. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న 4 పుణ్య క్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను దర్శించుకునేందుకు చేసే యాత్రనే ‘చార్‌ధామ్‌’ యాత్ర అంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించాలని ప్రతీ హిందువు కలలు కంటారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మొదలై… అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలం అంతా మంచులో కప్పబడి ఉంటాయి. అందుకే చలికాలం వాటిని దర్శించడం కుదరదు. కావున ఆరు నెలలపాటు దేవాలయాలు మూసేసి ఉంచుతారు.
యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్నాథ్‌, బద్రీనాథ్‌ దర్శనంతో ముగుస్తుంది. అందరూ ఇలానే చేయాలని లేదు. కొందరు కొన్నింటిని మాత్రమే దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. విమానంలో వెళ్లాలనుకునేవారు డెహ్రాడూన్‌, రైలులో రిషికేశ్‌ వరకు వెళ్లవచ్చు లేదా ఢిల్లీ నుంచి 206 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి హరిద్వార్‌ చేరుకోవాలి. అక్కడ రాత్రి బస చేసి గంగా హారతి, మానసా దేవి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే హరిద్వార్‌ నుంచి బారాకోట్‌ మీదుగా యమునోత్రికి వెళ్లే బస్సులు ఉంటాయి.

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్.

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్…

 

 

Helicopter crash: ఉత్తరాఖండ్‌ ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌‌లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది.

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Uttarakhand: ఇటీవల అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌‌ (Uttarakhand)లో ఆదివారం హెలికాఫ్టర్ (Helicopter) కుప్పకూలింది (Crash).
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మద్య ఆర్యన్ కంపెనీకి చెందిన హెలీకాఫ్టర్ ఈ ప్రమాదానికి గురైంది.
అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆదివారం తెల్లవారు జామున 5:20 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి బయలుదేరింది.
గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది.
పైలెట్ సహా ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు.
ప్రయాణీకులు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్‌కు చెందినవారుగా గుర్తించారు.
ప్రమాదఘటన తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాఫ్టర్ల ప్రమాదాలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు.

హెలి సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హెలికాప్టర్ల సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరి అని ప్రయాణానికి ముందు ఖచ్చితమైన వాతావరణ సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అన్ని సాంకేతిక భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version