డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం…

డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

 

విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని వామ పక్షాల నేతలు అన్నారు. భారతదేశ కార్మిక, రైతాంగ, పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగిన ట్రంపు నాయకత్వాన్ని సమర్థించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ ను నోటిఫై చేసింది. అభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రజా ఆమోదం లేని విధివిధానాలను చట్ట రూపంలో తీసుకురావాలని ఆలోచనతో, అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, జాతీయస్థాయి కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను శామీర్ పేట్ రాజీవ్ రహదారి పై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి, డి.జి నరేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సి.పి.ఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు డి.జి.సాయిలు గౌడ్ మాట్లాడుతూ విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యున్నత భాగం కార్మిక, రైతాంగం, అలాంటి నాయకత్వాలను సంప్రదించకుండా వారితో చర్చలు జరగకుండా విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని వామ పక్షాల నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ దశరథ్, జిల్లా కార్యదర్శి నిమ్మల నరసింహ, జిల్లా అధ్యక్షులు డి.జంగయ్య, గౌరవ అధ్యక్షులు సామల వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రాజిరెడ్డి, సి.పి.ఐ మండల సహాయ కార్యదర్శి సోగ్గాడ రమేష్, సి.పి.ఐ సీనియర్ నాయకులు గొలుసుల మల్లయ్య, మహిళా సమైక్య నాయకురాలు పుట్ట మనెమ్మ , నరసింహ, ఎం.కొండయ్య, జిల్లా సి.ఐ.టి.యు ఎం. కిష్టప్ప, సిపిఎం మండల కన్వీనర్ గోపాల్ , సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎల్లన్న , ఏ.ఐ.టి.యు.సి పారిశ్రామిక కార్మికులు సి.ఐ.టి.యు, పారిశ్రామిక కార్మికులు, పెద్దమ్మ కాలనీ ఇళ్ల పోరాట కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పోలీసులు 26 మంది నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version