ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

*యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ *

నర్సంపేట నేటిధాత్రి:

 

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి.
నర్సంపేటలో ఐక్య విద్యార్థి సంఘాలు సమావేశంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగిలిచర్ల సందీప్,పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముక రవి.ఎంఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధూ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాధికారులు విఫలమయ్యారన్నారు. విద్యాధికారులు ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఇచ్చే మాముళ్ళకు అలవాటు పడి వాటిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. విద్యకు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ఉన్న వాటిని అమలు చేయడంలో విద్యాధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు బుక్స్ , డ్రెస్సుల పేరుతో వేల రూపాయలను వసూలు చేస్తూ విద్యా కేంద్రాల్లో షాపులు పెట్టి మరి నడుపుతున్న అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు స్వాతిక,కీర్తన,అలేఖ్య,సిద్దు,ప్రభాస్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version