చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర ఉత్సవాలు

చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర: 12 నుంచి 16 వరకు వైభవంగా ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ దుర్గాభవాని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రుద్ర గాయత్రి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

12న సోమవారం పీర్ల గంధం, 13న మంగళవారం బేతాళ స్వామి పూజలు, 14న బుధవారం గ్రామ దేవతలకు పూజలు, ప్రవచనాలు, భజన కార్యక్రమాలు, 15న గురువారం బండ్లు, బోనాలు, 16న శుక్రవారం దుర్గామాత కళ్యాణం, పెద్ద పూజలు, గౌరంగాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

రాజనగరంలో అయ్యప్పస్వామి మండల పూజ ఊరేగింపు

అయ్యప్పస్వామి మండల పూజ సందర్భంగా స్వాములు ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి .

 

రాజనగరం అయ్యప్పస్వామి ఆలయంలోకి శుక్రవారం మండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఊరేగింపు నిర్వహించారుమండల పూజ
ఉత్సవంలో స్వామి వారి ఆభరణాలు అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చీర్ల.కృష్ణ సాగర్ గురుస్వామి అద్యర్యము లో ఊరేగింపు నిర్వహించారు అయ్యప్ప స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తు కృష్ణ గురుస్వామి,కోశాధికారి పాపిరెడ్డి,ప్రచార కార్యదర్శి అమర వాది చిట్యాల నరేందర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మండల పూజ భక్తిశ్రద్ధలత జెరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమములో ఆలయ అర్చకులు అచ్చితాపురం రమేష్ బాబు ,బీచుపల్లి యాదవ్ ,వాకిటి.శ్రీధర్ నందిమల్ల.అశోక్, యాదగిరి,ఆవుల.రమేష్ ,భక్తులు పాల్గొన్నారు

శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం…

శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

సుభాష్ కాలనీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో
ధర్మ ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం రాష్ట్రంలోనే మొట్టమొదట భూపాలపల్లి పట్టణం సుభాష్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… సనాతన ధర్మపరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ధర్మ ప్రచారం ద్వారా సమాజంలో నైతిక విలువలు, శాంతి ఐక్యత పెంపొందుతాయని ఎమ్మెల్యే అన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version