అప్పలరావుపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

అప్పలరావుపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

గ్రామపంచాయతీ ,నర్సరీ, పాఠశాలల సందర్శన

మధ్యాహ్న భోజనం పరిశీలన

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని అప్పలరావుపేటలో మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ వై వి గణేష్ గారు ఆకస్మిక పర్యటన జరిపారు. ఎంపీడీవో శ్రీ దయాకర్ తో కలిసి ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీ ,గ్రామపంచాయతీలను సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం నిర్వహణ తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ప్రజా పాలనలో రోజు వారి కార్యక్రమాల ప్రగతి నివేదికల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. అలాగే అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పంపిణీ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, మెనూ వివరాలను ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రవణ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన నాణ్యత పై విద్యార్థులతో మాట్లాడారు.అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన ప్రగతిని పరిశీలించారు. రోజు వారి కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దయాకర్ గారు, గ్రామ సర్పంచ్ ఊడుగుల అశోక్, గ్రామ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు, ఏకాంబరం ,బోళ్ళ కుమార్, శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది కిరణ్, ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రవణ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ నూరజ్, పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్, గీత ,యాకయ్య, భూలక్ష్మి ,వెంకట్రాజం, దయాకర్, శ్రీనివాసాచారి , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version