విద్యుత్ ఉద్యోగుల ధర్నా…

విద్యుత్ ఉద్యోగుల ధర్నా

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి మోత్కూరి కోటి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ యాళ్ల సురేందర్ రెడ్డి ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈ ధర్నాలో ఆర్టిజన్, అన్‌మాన్, స్పాట్ బిల్లర్స్, ఎస్‌పీఎంలు ఇతర పీస్‌రేట్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్మికుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క కార్మికుల సమస్యను పరిష్కరించాలి అని వారు అన్నారు
ఆర్టిజన్ కార్మికులను వారి విద్యార్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి
ఏపీఎస్ఈబి నిబంధనలు పూర్తిగా అమలు చేయాలి
ఒకే సంస్థలో సంవత్సరాలుగా పని చేస్తున్న అన్‌మాన్ కార్మికులను ఆర్థిక ఆర్టిజన్‌గా గుర్తించాలి
కార్మికులకు శాశ్వత పరిష్కారం కల్పించాలి
కార్మికులు సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా అనంతరం డివిజన్ ఇంజనీర్ కి కార్మికుల సమస్యలను వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఉమ్మడి డివిజన్ కమిటీ భూపాలపల్లి ఆధ్వర్యంలో టీవీఏఈ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో:
చైర్మన్‌గా – నాగుల తిరుపతి రెడ్డి
కన్వీనర్స్‌గా – మోత్కూరి కోటి, తిప్పారపు రాజు
కో-కన్వీనర్స్‌గా – సమ్మయ్య, జన రవీందర్
కో-చైర్మన్‌గా – బత్తుల రాజేందర్
వైస్ చైర్మన్‌లుగా – జి. సుదర్శన్, ఎల్. రాజయ్య
జాయింట్ సెక్రటరీగా – వేముల కిరణ్
కోశాధికారిగా – హరిచంద్ర
నూతన జేఏసీ కమిటీ ఏర్పాటుతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 7న “చలో వరంగల్” కార్యక్రమం నిర్వహించి, అవసరమైతే సమ్మెలోకి వెళ్లే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ధర్నా అనంతరం టీవీఏఈ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వంటేరు మల్లయ్య, ఎండి అక్షావాలి, భాస్కర్ చారి, విజేందర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవసరం

*రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి*
వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండలంలోని పట్టధార్ పాస్ బుక్ కల్గిన రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కావున ఇది చేసుకోవడం వల్ల రైతు గుర్తింపు కార్డు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో రైతుల యొక్క డిజిటల్ డేటా బేస్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ బుక్ నంబర్ ఇతర పూర్తి వివరాలు పొందుపరిచి రైతులకు కేంద్రం ద్వారా వచ్చే పథకాలను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు లేనివారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం వారు తెలిపారు. కావున ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు మీ సమీప మీసేవ కేంద్రాల్లో లేదా మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించి వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా కోరుతున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version