బోరు మోటర్ రిపేరు చేయించిన సర్పంచ్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బోరు మోటర్ రిపేర్ చేయడం జరిగింది. సందర్భంగా మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ. వచ్చే వేసవి కాలంలో తాగు నీటి సమస్య రాకుండా ఉండడానికి ఈరోజు మండే పల్లి గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో అంగన్వాడి సెంటర్ దగ్గర చేతి బోరు రిపేరు చేయించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విలలో గ్రామపంచాయతీ పాలకవర్గం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తున్నాయి ఏమైనా సమస్యలు ఉంటే గ్రామంలో పాలకవర్గ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచి గాధగోని సాగర్ ఉపసర్పంచ్. యాస మధు. కారోబార్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
