విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి…

విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని,ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల నిమిత్తం జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వెలుతురు,ఫ్యాన్లు,మూత్రశాలలు, అత్యవసర నిమిత్తం అవసరమైన మందులు,వైద్య సిబ్బంది నియమించడం జరిగిందని,పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు.
పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, సెల్‌ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version