బిఆర్ఎస్ అంటేనే దోచుకోవడం దాచుకోవడం..

బిఆర్ఎస్ అంటేనే దోచుకోవడం దాచుకోవడం

ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత రేవంత్ సర్కార్ దే

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ పార్టీ అంటేనే దోచుకుని దాచుకునే పార్టీ అని గత పదేళ్ల పాలన అంతా కమిషన్ల పాలన అని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.గత బిఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవానికి ఇల్లు,రేషన్ కార్డులు ఇవ్వలేదని అలాంటివారు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డు అందించిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దేనని,ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ,ఉచిత విద్యుత్తు,గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇచ్చి పేదల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.ఓట్ల కోసం రాజకీయం చేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన ప్రజాపాలన నడుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ,చిన్నల గోనాథ్, ఎండి రంజాన్ అలీ,పంచగిరి జయమ్మ,బుర్ర రాజమౌళి,చందుపట్ల రాఘవరెడ్డి,మెరుగు శ్రీశైలం, పసుల రమేష్ ల్,మడికొండ సంపత్,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,బండి సదానందం గౌడ్,మడికొండ శీను,దుబాసి వెంకటస్వామి,ఏకు రాజు, నల్లల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి ని సన్మానం

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ల జిల్లా పోరం అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన చందుపట్ల రాజిరెడ్డిని సోమవారం రోజున కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,సమన్వయ కమిటీ సభ్యులు పంచగిరి జయమ్మ,చిన్నాల గోనాథ్, ఎండి రంజాన్ అలీ,చందుపట్ల రాఘవరెడ్డి,మడికొండ సంపత్ కుమార్,పసుల రమేష్,దుబాసి వెంకటస్వామి, బుర్ర రాజమౌళి,నల్లెల్ల అనిల్ కుమార్,మెరుగు శ్రీశైలం,బండి సదానందం గౌడ్,మడికొండ శ్రీను,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version