శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు
శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు తరలి వెళ్లిన సింగరేణి కార్మికులు.కరీంనగర్ లోని గోవిందపతి శ్రీవారి సేవ ఫౌండర్ గోవిందపతి శీనన్న ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దొమ్మటి విజయ్ కుమార్,రాజేందర్, స్పందన,సత్య ప్రసాద్,నరేష్, శ్రీనివాస్,మోహన్ లు ప్రతి సంవత్సరం తేదీ 28/04 నుండి 05/05/25 వరకు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో మునిగిపోతున్నారు.దేశం, రాష్ట్రం శష్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వారు ప్రతి సంవత్సరం శ్రీవారి సేవలో వేడుకుంటున్నట్లు తెలిపారు.