తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు…

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు

నడికూడ,నేటిధాత్రి:

 

నడికూడ మండల కేంద్రం తో పాటు వరికోల్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వరికోల్ గ్రామంలోని శ్రీరామలింగేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేసి స్విట్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా మండల ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,హనుమకొండ విద్యార్థి సంఘం విభాగం జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి,మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,ఉపసర్పంచ్ భుజంగరావు మాట్లాడతూ
తెలంగాణ వస్తుందో రాదో
అన్న అనుమానన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన అపర భగీరథుడు,మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కెసిఆర్,ఆయన లేనిదే ఈరోజు స్వరాష్ట్ర స్వప్నం సాకారమయ్యేది,కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత ఆయనది. రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి రాజకీయ నాయకుడిగానే కాకుండా,ఒక కవిగా, సాహితీవేత్తగా,తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు
కెసిఆర్ మరిన్ని వసంతాలు పూర్తి చేసుకుని,నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మరింత సుఖసంతోషాలతో ఉండాలని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నందికొండ జయపాల్ రెడ్డి,
సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షులు తిప్పర్తి సాంబశివరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి లింగాల తిరుపతి,మాజీ సర్పంచ్ గూడెం కృష్ణమూర్తి,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి,రావుల కిషన్
ఉపసర్పంచ్ రాసమళ్ళ మల్లికార్జున్,కంకణాల వినయ్ గోనెల్ శరత్,రామ్ చందర్ వీరమళ్ళ మల్లారెడ్డి,కిన్నెర మణి,సంఘని వేణు దేవేందర్ రావు,కాందాల అశోక్,కోడెపాక నరేష్, నారగని రాకేష్,మధూకర్ బాబా,శ్రీధర్,తదితర బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి.శివరాత్రి జాగరణ లో భాగంగా ఆయన అర్ధరాత్రి లింగోద్భావ కాలంలో ఆలయంలో పూజలు జరిపారు.అనంతరం ఆయన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు.పలువురు గ్రామస్తులు గ్రామంలోని వల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ చిన్న గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశానని,గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేశానని అన్నారు.ఇకపై కూడా ప్రజల సుఖ సంతోషాలు అభివృద్ధి కోసమే తన కృషి ఉంటుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version