మహాత్మా పూలేకు ఘన నివాళి

సామాజిక న్యాయదిక్సూచి జ్యోతిరావు పూలే

టి,ఎన్,ఎస్,ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి

సిరిసిల్ల టౌన్,నేటిధాత్రి:

 

సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా జ్యోతిరావు పూలే అని టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు,టిడిపి వేములవాడ నియోజకవర్గ అడాహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి అన్నారు.
సామాజిక న్యాయం,మహిళా విద్య, సమాన హక్కుల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన భాందవుడు అని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తిగా నిలిచిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం…

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/aDumjuwXe-4?si=rooj0J56msbeCnMA

 

సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట సబ్ డివిజన్ కార్యదర్శి మొగలి ప్రతాపరెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చాయి.ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంస్కరణ,అణగారిన వర్గాలకు, శూద్రులకు అలాగే మహిళలకు విద్య సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్. స్థాపించారని తెలిపారు.కాగా 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆబర్ల రాజన్న, షేర్ మధు, పెద్దపోయిన అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version