కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం
నర్సంపేట,నేటిధాత్రి:
సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట సబ్ డివిజన్ కార్యదర్శి మొగలి ప్రతాపరెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చాయి.ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంస్కరణ,అణగారిన వర్గాలకు, శూద్రులకు అలాగే మహిళలకు విద్య సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్. స్థాపించారని తెలిపారు.కాగా 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆబర్ల రాజన్న, షేర్ మధు, పెద్దపోయిన అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు.