3వ రోజు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో బట్టు కర్ణాకర్

3వ రోజు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో బట్టు కర్ణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం – మూడో రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి విశ్వనాథన్ పాల్గొన్నారు. వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరం పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో శిబిరం సమర్థవంతంగా కొనసాగుతోంది.
ఈ పది రోజుల శిక్షణా శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా & మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపై నిపుణుల ద్వారా సవివరంగా శిక్షణ అందిస్తున్నారు. జిల్లాల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version