వివక్ష లేని సమాజం – మనందరి బాధ్యత…

వివక్ష లేని సమాజం – మనందరి బాధ్యత

– ఎస్సై ఎం కాశీనాథ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మార్చ్ 31: వివక్ష లేని సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలనే జహీరాబాద్ గ్రామీణ ఎస్సై ఎం కాశీనాథ్ యాదవ్ అన్నారు. జహీరాబాద్ మండల పరిధిలోని తూముకుంట గ్రామంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం సమావేశంలో మాట్లాడుతూ..”కుల, మత, వర్గ వివక్షలు లేని సమాజం ఏర్పడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ ఫలాలను ప్రతి పౌరుడు పొందేలా చూడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అంశాల గురించి వివరించారు. చదువుకున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం వంటి దురాచారాల పట్ల ప్రజలను చైతన్యపరిచి, దేవాలయాలు, పాఠశాలలు, హోటళ్లు,బహిరంగ ప్రదేశాల్లో అందరికీ సమాన గౌరవం దక్కేలా చూడాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాలలో ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి.

గ్రామాలలో ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత.

అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

శనివారం టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ మారపల్లి కొమురయ్య ఆధ్వర్యంలో ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల ( సివిల్ రైట్స్ డే) దినోత్సవాన్ని జరపాలని అంబేద్కర్ ఫెలోషి ప్ నేషనల్ అవార్డు గ్రహీత రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య తహసిల్దార్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం సంబంధించిన అధికారులు జరుపుతున్నారు . ఈ పౌర హక్కుల దినోత్సవం లో గ్రామ సర్పంచి వార్డ్ మెంబర్లు వివిధ కులాల ప్రజలు ఇందులో పాల్గొనే విధంగా చూడాలని ముఖ్యంగా సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు ఎస్సీలు ఎదుర్కొంటున్న అంటరానితనం కుల వ్యవస్థ మూఢనమ్మకాలు అస్పృశ్యత అను అంశాలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నారు .దేశ రాష్ట్రవ్యాప్తంగా పౌర హక్కుల దినోత్సవం రోజు అధికారులు కొందరు తూతూ మంత్రంగా జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలలో ఇంకా కుల వ్యవస్థ అంటరానితనం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వాలు అధికారులు ఈ కుల వ్యవస్థ జరిగిన గ్రామాలలోని వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల దినోత్సవం నిర్వహించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన అధికారులను డిమాండ్ చేశారు. లేని యెడల దళిత సంఘాల తో కలిసి దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ అరకొండ రాజయ్య అంబేద్కర్ వాదులు గోదా బిక్షపతి అరకొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version