1897లో మహారాజుల విందు.. డిన్నర్లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా?
బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..
బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..
వరంగల్లో దట్టమైన పొగమంచు.
100 ఫీట్ల రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పైపులు
పైపులు తొలగించండి మేడం.. మున్సిపల్ కమిషనర్ కు స్థానికుల విన్నపం
నేటిధాత్రి, వరంగల్:
వరంగల్ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసిన వేళ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై మధ్యలో నిలిచిపోయిన పైపులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుమధ్యలోనే ఉన్న ఈ పైపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొగమంచు కారణంగా రోడ్డుపై స్పష్టత తగ్గిన పరిస్థితుల్లో పైపులు ఎక్కడున్నాయో తెలియక వాహనాలు అటువైపు దాటేందుకు ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళ స్కూల్కు వెళ్లే చిన్నారులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఉద్యోగులకు తీసుకెళ్లే వాహనాలు, చిరు వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డుకు మధ్యలో ఎలాంటి డివైడర్ లేకపోవడం, పైగా ఈ పైపులు అలాగే ఉండిపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదం కారణంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న పైపులను వెంటనే తొలగించి, భద్రత కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిద్ర మత్తులో రోడ్డు మరియు భవన అధికారులు
◆:- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
◆:- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ప్రధాని కూడలి అయిన ప్రస్తాపూర్ చౌరస్తా మరియు అంతర్జాతీయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థలకు వెళ్లే రోడ్డు అనునిత్యం రద్దీగా ఉంటుంది భారీ వర్షాల కారణంగా ఈ రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడింది ప్రతిరోజు ఉదయం
మరియు సాయంత్రం స్కూలుకు వెళ్లే పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతిరోజు చిన్న చిన్న ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజల యొక్క విన్నపం