దళిత భూమి అగ్రవర్ణాల కబ్జా….

దళిత భూమి అగ్రవర్ణాల కబ్జా….!

◆-: తమ భూమిని అగ్రవర్ణాలు కబ్జా చేశారని బాధితుల ఆవేదన…

◆-: కబ్జాను అడ్డుకున్న గ్రామ సర్పంచ్ తనయుడు ప్రసాద్ రెడ్డి…

◆-: దళితుల భూమిని ఎలా కబ్జా చేస్తారని వాగ్వాదం…

◆-: బోరున విలపిస్తున్న దళిత బాధిత మహిళలు….

◆-: గత 40,సంవత్సరాలనుండి తాము కబ్జాలోనే ఉన్నామన్న బాధితులు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామంలోని 27వ సర్వేనంబర్ లో 1ఎకరం అసైండ్ భూమిని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దళితులకు బ్రతకడానికి సజ్జపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ అయిన కొతిలి ఎల్లమ్మ పేరుపైన ప్రభుత్వం సంబంధిత పత్రాలు జారీ చేసింది.

ఎల్లమ్మ చనిపోయిన తర్వాత ఆమె మూడవ కూతురైన అమృతమ్మ పేరుపైన అప్పటి తహసీల్దార్ సిబ్బంది రికార్డుల్లో పేరు నమోదు చేసినట్లు ఆధారాలు ఉన్నకూడా సజ్జపూర్ గ్రామానికి చెందిన కొత్తకాపు రమేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, దళితులమైన తమ భూమి పైన దౌర్జన్యం చేసి మా ఎకరం భూమి కబ్జా చేస్తుంటే గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించడంతో సర్పంచ్ తనయుడు ప్రసాద్ రెడ్డి కబ్జా అవుతున్న దళిత మహిళలమైన మా భూమి వద్దకు వెళ్లి కబ్జాకు గురవుతున్న సమయంలో జేసీబీని ఆపేయడం జరిగిందని లబ్దిదారులు కొతిలి అమృతమ్మ, బాధితులు కోతిలి శివమ్మ, బుజ్జమ్మ, తెలిపారు.

ఇదిలా ఉంటే శనివారం దళిత బాధిత మహిళలు తమకు ప్రభుత్వం ఇచ్చిన అసైండ్ భూమిని చట్టపరంగా స్వాధీనం చేసుకున్నారు. దళితులమైన మాకు న్యాయం చేయాలని సజ్జపూర్ గ్రామ సర్పంచ్ ను సర్పంచ్ తనయున్ని, గ్రామస్తులను వేడుకున్నారు.

 

 

సానుకూలంగా స్పందించిన గ్రామ సర్పంచ్ కుమారుడు ప్రసాద్ రెడ్డి అండగా ఉన్నానని బాధితులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కబ్జా చేసిన వారు ఎంతటివరైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాధితులకు ఇబ్బంది కలిగించే అగ్రకులస్తులు ఎవరైన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠినంగా వ్యవహారిస్తామని అన్నారు.

ప్రభుత్వ స్థలంలో ప్రయివేటు నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

ప్రభుత్వ స్థలంలో ప్రయివేటు నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

◆-: పల్లె ప్రకృతి వనం దారిని ఖబ్జాచేసి షెడ్డు నిర్మిస్తున్న వైనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన పల్లె ప్రకృతి వనం అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాకు గురై ప్రయివేటు నిర్మాణనికి పూనుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం కబ్జా విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరగా ఇది గ్రామ కంఠంలో లేదని, స్థలం పత్రాలను సంబంధిత రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమర్పించి ఈ యొక్క భూమి యాజమాన్యాన్ని తేల్చాల్సిందిగా కోరడం జరిగిందని అన్నారు. దీనిపై రెండు నుంచి మూడు రోజుల్లో యాజమాన్యం విషయం స్పష్టత వచ్చే అవకాశం ఉందని కార్యదర్శి తెలిపారు.

గత ప్రభుత్వం గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, సమతౌల్యం కోసం పల్లెల్లో వనాలను నిర్మించారని, దాని ఉద్దేశాన్ని అధికారుల విస్మరించి నిరుగారుస్తున్నారని, ప్రయివేటు నిర్మాణం వల్ల పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్లే దారిని మూసివేస్తు నిర్మాణం చేశారని, ఇప్పటికైనా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు స్పందించి కబ్జా బారి నుంచి కాపాడాలని సజ్జపూర్ గ్రామ ప్రజలు కోరారు. ఇక్కడ విశేషమేమిటంటే పంచాయతీ ఎన్నికల రెండు రోజుల ముందు అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండటన్ని అదునుగా చూసుకొని షెడ్డు గోడలు నిర్మించడం విశేషం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version