మేడారం బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి…

మేడారం బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల,నేటిధాత్రి

 

 

సోమవారం పట్టణంలోని అంగడి మైదానంలో పరకాల నుండి మేడారం వెళ్ళు బస్సులను శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.మేడారం జాతర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పండుగగా అని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించింది అన్నారు.

సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..

సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..

 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రయాణాలకు అనుకూలమైన రోజులు, దిశలను ఎంచుకోవడం ముఖ్యం. ఇలా ప్రణాళిక లేకుండా ప్రయాణించడం వల్ల కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణం అనేది జీవితంలో నిరంతర ప్రక్రియ. మతపరమైన తీర్థయాత్రలు, వ్యాపార లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం, మనం నిరంతరం ప్రయాణిస్తాము. అయితే, ఆధునిక జీవితంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రయాణాలు చేయడం సర్వసాధారణం. అయితే, ఇటువంటి ప్రయాణాలు కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. గతంలో, చాలా మంది ఏదైనా ముఖ్యమైన ప్రయాణానికి బయలుదేరే ముందు జ్యోతిషశాస్త్రం ప్రకారం తేదీ, సమయం, దిశను ప్లాన్ చేసుకునేవారు. కానీ నేటి కాలంలో ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా ప్రయాణాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రయాణించడానికి ఏ రోజులు మంచివి?

ప్రయాణం సంతోషంగా, విజయవంతంగా సాగడానికి కొన్ని రోజులు శుభప్రదంగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మతపరమైన కార్యక్రమాలు, దేవాలయాల సందర్శనలు, మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్రలు లేదా ఏదైనా ఆధ్యాత్మిక, ముఖ్యమైన పనిని చేపట్టడానికి ఉత్తమ రోజులు. ఈ రోజుల్లో ప్రారంభించే ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version