సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..

సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..

 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రయాణాలకు అనుకూలమైన రోజులు, దిశలను ఎంచుకోవడం ముఖ్యం. ఇలా ప్రణాళిక లేకుండా ప్రయాణించడం వల్ల కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణం అనేది జీవితంలో నిరంతర ప్రక్రియ. మతపరమైన తీర్థయాత్రలు, వ్యాపార లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం, మనం నిరంతరం ప్రయాణిస్తాము. అయితే, ఆధునిక జీవితంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రయాణాలు చేయడం సర్వసాధారణం. అయితే, ఇటువంటి ప్రయాణాలు కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. గతంలో, చాలా మంది ఏదైనా ముఖ్యమైన ప్రయాణానికి బయలుదేరే ముందు జ్యోతిషశాస్త్రం ప్రకారం తేదీ, సమయం, దిశను ప్లాన్ చేసుకునేవారు. కానీ నేటి కాలంలో ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా ప్రయాణాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రయాణించడానికి ఏ రోజులు మంచివి?

ప్రయాణం సంతోషంగా, విజయవంతంగా సాగడానికి కొన్ని రోజులు శుభప్రదంగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మతపరమైన కార్యక్రమాలు, దేవాలయాల సందర్శనలు, మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్రలు లేదా ఏదైనా ఆధ్యాత్మిక, ముఖ్యమైన పనిని చేపట్టడానికి ఉత్తమ రోజులు. ఈ రోజుల్లో ప్రారంభించే ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి : 

తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి, క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డి.ఈ. లలిత, ఏసిపి లు బాలాజి, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version