ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బృంద చర్చ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సమగ్ర సత్య రక్షణ అనే అంశంపై చర్చ. సందర్భంగా రామ్ వ్యవసాయ కళాశాల యొక్క దత్తత గ్రామమైన రాళ్లపేట రైతులకు వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ .వెంకట్రామ్. శ్రీ యశస్విని. రైతులకు వరిలో సమగ్ర సస్యరక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. రైతులు తము తమ పొలాలలో పాటిస్తున్న సస్య రక్షణ చర్యలు తమ ఎదుర్కొంటున్న పంట సమస్యల వారిని వివరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. తర్వాత .రాళ్లపేటలోని పాలు వరి పొలాలను సందర్శించి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంటుందని దాని నివారణకు తొలి దశలో ఐసో ప్రోతాయో లేన్.1.5మి.లీ. లేదా ట్రై సైక్లోజల్+మ్యామ్ కోజబ్.2.5గ్రా. లేదా కాసు గా మైసిన్.2.5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాళ్లపేట గ్రామ సర్పంచ్ పరిషరాములు రైతులు నాగరాజు ఎల్లయ్య తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తదితరులు పాల్గొన్నారు
