కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో ముందంజ….

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో ముందంజ

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టే.

మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

కేసముద్రం/ నేటిధాత్రి

కేసముద్రం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 వ వార్డు అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందిస్తానని మరియు కేసముద్రం మున్సిపాలిటీ లో 7 వ వార్డు అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని తెలియజేశారు. కేసంద్రం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మరియు మాజీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు.7వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రడం శ్రీనుకి మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు సన్న బియ్యం గృహజ్యోతి మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రజల మనసు దోచుకున్న కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రచారంలో రడం శ్రీను, రడం నిఖిల్,గుండు గోపాల్, మాదాసు సారంగం, కోలిపాక వెంకన్న, చిలుముల సదానంద చారి, బండి రమేష్, బండి తోట వెంకన్న, కొనతం కోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version