రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు వినతి పత్రం అందజేసిన…

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు వినతి పత్రం అందజేసిన

కాప్రా నేటిధాత్రి

 

ఎన్ ఎఫ్ సి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని సోమవారం శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి.
ఈ సందర్భగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.
ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.
వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.
ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (ఎస్ ఆర్ డి పి ) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి ఎన్ ఎఫ్ సి రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి…

కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి
వనపర్తి నేటిదాత్రి

వనపర్తి పట్టణం లో 10, 21 వ వార్డు మధ్యలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ అఖిల్ పక్ష ఐక్యవేదిక నాయకులు సందర్శిం చారు ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 21వ వార్డులో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కొంత పూర్తి చేశారని తెలిపారు నిర్మాణం పూర్హి చేసి కూరగాయల వ్యాపారులకు ఇస్త వనపర్తి లో ట్రాఫిక్ సమస్య ఉండదని అన్నారు కందకంలో నీరు నిలిచి ప్రజలు రోగాల కు గురి అవుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి కందకము లో కురాగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు సతీష్ యాదవ్ వెంట వెంకటేశ్వర్లు,తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, రామస్వామి, కురుమూర్తి, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version