ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం…

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుండి వయా రుద్రారం, రంగసాయిపల్లె, దత్తోజిపేట, లక్ష్మీపూర్, గ్రామాల నుండి గుండి గ్రామం వరకు రోడ్ వేయాలని మరియు బస్ రెగ్యులర్ గా నడవాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిఈకి మరియు ఆర్టిసి ఆర్ఎమ్ కీ ఫోన్ చేసి వెంటనే పనులు ప్రారంభించి, సమస్య పరిష్కరించాలని ఆదేశించిన మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణ రెడ్డి, సర్పంచులు ద్యావ అనంతరెడ్డి, గుడ్ల శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాంరెడ్డి, బీమా ఈశ్వర్, గంటల రవీందర్ రెడ్డి, కట్ల వెంకటేశ్, బండారి పర్సారాములు, పిట్టల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు మరమ్మతులతో వారం రోజుల రాకపోకల నిలుపుదల

*గుంత మర్పల్లి టు నర్సాపూర్ నర్సాపూర్ టు గుంత మర్పల్లి చౌరస్తా రోడ్డు మరమ్మతులు*

◆-: రోడ్డు మరమ్మతులు కారణంగా వారం రోజులపాటు రాకపోకలు నిలిపివెతః

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

 

ఝరాసంగం మండలం లోని గుంత మర్పల్లి గ్రామంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా గుంత మర్పల్లి టు నర్సాపూర్, నర్సాపూర్ టు గుంత మర్పల్లి చౌరస్తా వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు గుంత మర్పల్లి సర్పంచ్ ప్రియాంక నరసింహ గౌడ్ తెలిపారు.. రాకపోకలు కొనసాగితే రోడ్డు పనులకు ఇబ్బందులు జరుగుతుందని ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు వారం రోజుల పాటు వాహనదారులు సహకరించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version