ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ….

ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ

ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు. ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసనమండలిలో (AP Legislative Council) గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) మాట్లాడారు. ఐదు కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. క్రెడిబులిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని తేల్చిచెప్పారు. ఎంవోయూలు కుదుర్చుకున్నాకే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

భూముల కేటాయింపుపై అసెంబ్లీలో చర్చిద్దాం: అచ్చెన్నాయుడు

ఏపీ శాసనమండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. భూముల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. సంబంధంలేని ప్రశ్నలకు జవాబులు ఎలా చెబుతాం? అని నిలదీశారు. రహేజా రియల్‌ఎస్టేట్‌ వ్యవస్థ కాదని అన్నారు. మంత్రి ఒప్పుకున్నారనడం సరికాదని చెప్పుకొచ్చారు. ఆధారాలు చూపించకుండానే మళ్లీ అవే ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొ్న్నారు.

మైసమ్మ చెరువు జీవదారులు బంద్..! చెరువు నిండేది ఎలా..?

మైసమ్మ చెరువు జీవదారులు బంద్..! చెరువు నిండేది ఎలా..?

◆:- ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు కాల్వలను కబ్జా చేయడం.

◆:- అక్రమ మళ్లింపుపై విచారణ జరపాలని డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని పైడిగుమ్మాల్ పరిధిలో గల మైసమ్మ చెరువు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువుల నీరు పూర్తిగా నిండకపోవడం వల్ల స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాలు చక్కగా పడుతున్నా చెరువుల నీరు నిలవకపోవడం పలు అనుమా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీల వల్ల చెరువులోనికి నీరు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడం వల్ల చెరువు నిండ లేక పోతుంది. చెరువు యొక్క జీవదారులు అడ్డుకట్ట వేయడానికి బలమైన నేతల హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు.
గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, చెరువులో నిల్వ కావలసిన నీరు ఎక్కడికో మాయమవుతోంది. దీని వల్ల భవిష్యత్‌లో త్రాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై తెలంగాణ గ్రాడ్యుయేషన్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చెల్మెడ అనిల్ కుమార్ మాట్లాడుతూ..ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేయడాన్ని సహించేది లేదని వెంటనే విచారణ జరిపించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి,అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version