క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

పొత్తు ధర్మాన్ని వీడని ఎర్ర సూరీలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి గడ్డం వివేక్ ఇలాఖలో చక్రం తిప్పి మునిసిపాలిటీ గద్దెపై గులాబీ జెండా ఎగిరేలా ఎర్ర సూరీల తో వ్యూహాలు రచించి విజయం సాధించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ఎర్ర సూరీలు గులాబీ జెండా కు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి , మంత్రి ఇలాకాలో గులాబీ జెండా ఎగరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్న సిపిఐ పార్టీ నాయకులు క్యాతనపల్లిలో అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడంతో అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులను తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీతో జతకట్టినట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి ఒకవేళ ప్రస్తుత సందర్భాలలో కాంగ్రెస్ తో జతకడితే క్యాతనపల్లి మునిసిపాలిటీలో సిపిఐ పార్టీకి మునగడ కరవయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎర్ర సూరీలకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మునిసిపాలిటీలో గులాబీ జెండా ఎర్ర సూరీలతో కలిసి ఎగురుతోందని ప్రజలంతా భావిస్తున్నారు. అలానే జరగాలని ప్రజలంతా ఓటర్లంతా కోరుకుంటున్నారు. ఎర్ర సూరీలు సైతం పొత్తు ధర్మాన్ని విస్మరించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version