ప్రజల తప్ప నాయకుల తప్ప..

ప్రజల తప్ప నాయకుల తప్ప..?

నాయకుల మీద ప్రజలకు పెరుగుతున్న అసంతృప్తి

టికెట్ వచ్చే వరకు ఒక పార్టీ…గెలిచాక ఇంకొక పార్టీ…

పరకాల,నేటిధాత్రి

 

రాజకీయాల్లో విలువలు ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్నలు రోజురోజుకీ బలంగా వినిపిస్తున్నాయి.ఎన్నికల ముందు ఒక పార్టీ జెండా ఎగరేస్తూ,ఆ పార్టీ సిద్ధాంతాలపై ప్రసంగాలు చేసే నాయకులు,టికెట్ రాకపోతే వెంటనే మరో పార్టీలో చేరడం సాధారణమైపోయింది.ప్రజల ముందర సేవాభావం అంటూ చెప్పుకునే నాయకులు,పదవి కోసం మాత్రం సిద్ధాంతాలను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది.ఎన్నికల సమయంలో “మా పార్టీ మా ప్రాణం”అంటూ హామీలు ఇస్తూ,ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన పార్టీలోకి చేరడం కొత్త సంస్కృతిగా మారుతోంది.ఇది ప్రజాస్వామ్యానికి మేలా?
లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటు వేసే సమయంలో ప్రజలు పార్టీ సిద్ధాంతాలను,
అభ్యర్థి నిబద్ధతను విశ్వసించి తమ తీర్పు ఇస్తారు.కానీ ఆ విశ్వాసం నిలబెట్టుకోవాల్సిన నాయకులే
పార్టీ మార్పులతో ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నారు.టికెట్ రాకపోతే అసంతృప్తి,టికెట్ రాగానే ఆనందోత్సాహాలు,
గెలిచాక మరో పార్టీ వైపు చూపు ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిందనే భావన ప్రజల్లో కలుగుతోంది.సాధారణ కార్యకర్తలు సంవత్సరాల పాటు కష్టపడితే,అంతిమంగా అవకాశాలు మాత్రం ఆఖరి నిమిషంలో చేరిన వారికే దక్కుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.పార్టీల్లో కష్టపడిన వారిని పక్కనబెట్టి,
వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రాధాన్యం ఇవ్వడం అసంతృప్తికి దారి తీస్తోంది.ప్రజలు మాత్రం అభివృద్ధి,పారదర్శకత,
స్థిరత్వం కోరుకుంటున్నారు.కానీ నాయకుల పార్టీ మార్పులు
ఆ ఆశలను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎన్నికల సమయంలో ఒక మాట,
ఎన్నికల తర్వాత మరో మాట ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమా అనే చర్చలు జరుగుతున్నాయి.ప్రజల ఓటు విలువను కాపాడాల్సిన బాధ్యత
ఎన్నికైన ప్రతినిధులపై ఉంది.
అయితే పదవుల కోసం పార్టీ మార్పులు
ఆ బాధ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.ప్రజలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.ఎవరు నిజంగా సేవాభావంతో ఉన్నారు?ఎవరు కేవలం అవకాశవాదులే? అన్నది గమనిజంచే పనిలో ఉంటున్నారు.రాజకీయాల్లో స్థిరత్వం,సిద్ధాంతాలకు కట్టుబాటు,ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం
ఇవే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులని చెప్పవచ్చు.ప్రజలు మారాలని కొందరు అంటున్నారు.
నాయకులు మారాలని మరికొందరు అంటున్నారు.అయితే నిజమైన మార్పు
నాయకుల నిబద్ధతలో కనిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.పార్టీ మార్పులు కాదు,ప్రజా సేవే ముఖ్యమని నిరూపించగలిగినప్పుడు మాత్రమే
నాయకులపై విశ్వాసం మరింత బలపడుతుంది.అంతవరకు ఈ ప్రశ్న మాత్రం వినిపిస్తూనే ఉంటుంది.

మేడ్చల్ జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు

బీజేపీ లో చేరికలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ దే విజయమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మూడు చింతలపల్లి మాజీ మండల అధ్యక్షులు నందాల శ్రీనివాస్, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు చింతల మాణిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ నరసింహరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెనుక గళ్ళ అనూష , కొల్తూరు ముదిరాజ్ సోదరులు కే నర్సింగారావు, కే అశోక్,కే సుధాకర్, కే భూపాల్, జే బాల నరసింహ,ఏ అశోక్,ఏ బిక్షపతి రాజు, జి జంగాలు ఎస్ వెంకట స్వామి, జె రమేష్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కొల్తూరు 17, 18, 19, వార్డుల్లోని కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు బిజెపిలో చేరారు. వారికీ శనివారం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, ఎస్ మల్లేష్ యాదవ్, ఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌లో మునిసిపల్ ఎన్నికల వేళ రాజకీయ కలకలం

ఆగమాగం అవుతున్న ఆ పార్టీ

* మునిసిపల్ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ కు బీటలు
* బిఆర్ఎస్ గూటికి 400 మంది కాంగ్రెస్, బీజేపీ నేతలు
* దడ పుట్టిస్తున్న మునిసిపల్ ఎన్నికలు
* ఆగమాగంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు
* కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మోరాయిస్తున్న సీనియర్లు, బి ఫారం పంచాయతీలతో ఆ పార్టీలు ఆగమాగం అవుతున్నాయి. పార్టీ పీరా ఇంపులతో తలలు పట్టుకుంటున్నాయి. పార్టీలను విడుతున్న నేతలను బుజ్జగించడంలో గోరంగా విఫలం అవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు మేడ్చల్ నియోజకవర్గం లోనే. మునిసిపల్ ఎన్నికల హడావిడి మొదలవగానే పార్టీ పీరాఇంపులు మొదలయ్యాయి. మల్లన్న దూకుడుకు కాంగ్రెస్, బీజేపీ లు కంగూటింతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బిఆర్ఎస్ బాట పట్టారు. వందల సంఖ్యలో కార్యకర్తలు, ముఖ్యనేతలు బిఆర్ఎస్ లో చేరడం చర్చనియా అంశాంగా మారింది. మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ 22 వ వార్డు కొనాయిపల్లి – మైసిరెడ్డిపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమరం, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం, అలియాబాద్ మునిసిపల్ అలియాబాద్ నుండి సుమారు 400 మంది బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కొనయపల్లి లో…
గ్రామ అధ్యక్షులు గుంటి దీపక్ ముదిరాజ్, గ్రామ మాజీ సర్పంచ్ గుంటి శేఖర్ ముదిరాజ్, గుంటి కుమార్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటి చిన్న కుమార్, గుంటి భాస్కర్, అన్నారం శ్యామ్ కుమార్, గుంటి నర్సింగరావు, సంచులింగం, జక్కుల ప్రవీణ్, జక్కుల వంశీ, బోయిని సత్యనారాయణ, అన్నారం నరసింహ, జక్కుల శోభ, బోయిని కుమార్, జక్కుల యాదగిరి, జక్కుల బిక్షపతి, జక్కుల కృష్ణ, ఉప్పరి సత్తయ్య, జక్కుల చిన్న బిక్షపతి, గుంటి మహేందర్ మరియు దాదాపు 100 మంది మహిళాలు, యువకులు.

సోమారం లో…
సోమరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కరుణకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ వార్డ్ మెంబెర్ సి హెచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్.కృష్ణ, ఆర్. బలరాం, బి చంద్ర శేఖర్, అశోక్ లు.

అలియాబాద్ లో…
అలియాబాద్ మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లక్ష్మి, బండి రామ్ రెడ్డి, బండి శ్రీకర్ రెడ్డి లతో పాటు 20.

ఎల్లగూడెం లో….
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్లం వెంకటేష్, రమేష్, సంతోష్, సాయి కిరణ్, కాంగ్రెస్, బీజేపీ నుండి 60 మంది.

ఆనంతారంలో…
కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు కొల్లా స్వప్న, బుద్ది నరేష్, ముద్దమ్ శ్రవణ్ రెడ్డి, మామిడాల వెంకటేష్ గౌడ్, స్వామితో పాటు 30 మంది పార్టీ లో చేరగా విరందరికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఆహ్వానించారు.

నర్సంపేటలో బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

బిఆర్ఎస్ పార్టీ లో పలువురి చేరిక..

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురంకు చెందిన బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గుడెపు రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దికుంట్ల సోమన్నలు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, కమలాపురం, ముతోజిపేట బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రవీణ్, బూర సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version