పరకాల వైద్యుడికి అరుదైన గౌరవం
భారతీయ నంది అవార్డు అందుకున్న డాక్టర్ రోహిత్ సాదు
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యుడు డా.సాదు రోహిత్కు అరుదైన గౌరవందక్కింది.హైదరాబాద్లోని స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ప్రదానం చేసే “భారతీయ నంది అవార్డు”ను ఆయన అందుకున్నారు.కరోనా సమయంలో ప్రజలకు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేసినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.పరకాల పట్టణంతో పాటు శాయంపేట,రేగొండ, నడికూడ,మొగుళ్లపల్లి మండలాల్లో ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన డా.రోహిత్ సాదుకు ఈ అవార్డు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న ఆయనకు ఈ గౌరవం దక్కడం గర్వకారణమని పలువురు అభినందించారు.
కరోనా సమయంలో విశేష సేవలు
కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది రోగులకు ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారి ఆరోగ్య పునరుద్ధరణకు డా.రోహిత్ సాదు కృషి చేశారు.ఈ సేవలను గుర్తించిన స్ఫూర్తి సొసైటీ ఆయనకు భారతీయ నంది అవార్డు ప్రదానం చేసింది.
