ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించే ందుకు ముందుకు రావాలి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండల కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 లో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని అన్నారు అసంక్రమణ వ్యాధులు అయినటువంటి(NCD) బిపి, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఆశా కార్యకర్తలు పాత్ర కీలకమైనదని ఆశా కార్యకర్తల సమావేశంలో తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిగా తనిఖీ చేసి ప్రతి డిపార్ట్మెంటు లోని సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవి , ఎంపీడీఓ సురేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. రాజేంద్రప్రసాద్, మ్మెలహ్ప్ డాక్టర్స్, సూపర్వైజర్స్, హెల్త్ అసిస్టెంట్, ఆస్పత్రి సిబ్బంది, Ann’s, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
