భూపాలపల్లిలో ఘనంగా పాపన్న వర్ధంతి వేడుకలు..
సీఐ నరేష్ కుమార్ గౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో పయనించాలని సీఐ నరేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ లు మాట్లాడుతూ బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, అయన గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని అన్నారు. పీడిత జనుల కోసం, బహుజుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన పాపన్న గౌడ్ చేసిన సేవలు మనందరికి గర్వకారణమన్నారు. ప్రతి మండలకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు కూనూరి సురేష్ గౌడ్, బుర్ర సునిత గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర కుమారస్వామి గౌడ్, జగన్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, గైని ఎల్లా గౌడ్, నాగపూరి సమ్మయ్య గౌడ్, ఏరుకొండ గణపతి గౌడ్, విజేందర్ గౌడ్, ప్రకాష్ గౌడ్, చుక్క బాలరాజు గౌడ్, కోల తిరుపతి గౌడ్, కోల శ్రీనివాస్ గౌడ్, గడ్డం శేఖర్ గౌడ్, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
