అయినవోలులో వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి…

అయినవోలులో వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి*
మెంతా తుఫాన్ భాదిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
ఒక ఎకరానికి 40 వేల నష్టపరిహారం అందించాలి
జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు

నేటిధాత్రి ఐనవోలు :-

 

అయినవోలు మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ , ఐకెపి, ఏర్పాటు చేసి మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు , కేంద్రం ఏర్పాటు చేసి వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జీఎంపీస్ గొర్రెల మేకల పెంపక దారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
“రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు, మెంతా తుఫాను వలన తీవ్ర నష్టం జరిగింది. వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు పెద్ద ఎత్తున నేలకూలిపోయాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులను ఆదుకోవడం అత్యవసరం,” అన్నారు.
ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికీ ₹500 బోనస్, పత్తికి ₹475 బోనస్ వెంటనే చెల్లించాలి.పంట నష్టపోయిన రైతులను గుర్తించి, వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేసి వరికి ఎకరాకు ₹40,000, పత్తికి ఎకరాకు ₹60,000 నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ”రైతును రాజు చేస్తున్నామని చెప్పడం సులభం, కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతును కాపాడడం నిజమైన ప్రభుత్వ ధర్మం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆలయ ట్రస్ట్ బోర్డులో యాదవులకు చోటు కల్పించాలి…

ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో యాదవులకు చోటు కల్పించాలి
ఐలోని మల్లన్న స్వామిని యాదవులు కులదైవంగా కొలుస్తారు
స్వామివారి సేవకు యాదవులను దూరం చేసే కుట్ర జరుగుతుంది
అందుకే యాదవులకు ట్రస్ట్ బోర్డులో చోటు ఇవ్వలేదు
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని యాదవులకు చోటు కల్పించాలి
జి ఎం పి ఎస్ మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

 

అయినవోలు మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా కొలువుదీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంలో స్థానిక యాదవులను గుర్తించకపోవడం స్థానిక యాదవులను అవమానపరచడమేనని జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు విమర్శించారు. శుక్రవారం ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అయినవోలు మండలంలో అయినవోలు గ్రామానికి చెందిన గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా యాదవులను గుర్తింపు లేకుండా అవమానపరుస్తున్నారని నల్లబెట్ట రాజు యాదవ్ ఆవేదన వ్యక్తపరిచినారు. మేము ఓట్ల బ్యాంకు వరకేనా, కనీసం నామినేట్ పోస్టులకు కూడా అర్హత లేకుండా పోయినామా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి యాదవులను గుర్తించి ట్రస్ట్ బోర్డులో కనీస గౌరవప్రధ స్థానాలనైనా స్థానిక యాదవులకు కేటాయించాలని చినరాజు విజ్ఞప్తి చేసినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version