డ్రైనేజీ సమస్య పరిష్కరం మురికి కాలువ నిర్మాణం…

డ్రైనేజీ సమస్య పరిష్కరం మురికి కాలువ నిర్మాణం

◆-: నేతాజీ నగర్ కాలనిలో సమూలమైన అభివృద్ధి : కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ గౌస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డు అభివృద్ధి కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సహకారంతో వార్డును సమూలంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో ఇంచార్జ్ సహకారంతో పట్టణంలోనే ఆదర్శంగా కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామాని ఫయాజ్ నగర్ కాలనీ 21 వ వార్డు అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ అన్నారు. ఆదివారం నాడు పట్టణంలోని నేతాజీ నగర్ కాలనిలో డ్రైనేజీ సమస్య పరిష్కరం కోసం కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడు గౌస్ కలనివాసులతో కలిసి టెంకాయ కొట్టి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే డా చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ధి పనులు చేసి కాలనిలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ నబి, మొహమ్మద్ ఆర్షద్, మొహమ్మద్ ఇర్ఫాన్, మొహమ్మద్ గౌస్, అజిం, యూసుఫ్, మహేతబ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version