ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడం *

ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడం *
HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం మొగుళ్లపల్లి

నేటి దాత్రి

 

తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ జిల్లా భూపాలపల్లి డి ఎం హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ మండల వైద్యాధికారిని డాక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ నవత ఆధ్వర్యంలో సోమవారం రోజునగ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ గారి చేతుల మీదుగా, ముఖ్య అతిథి తాసిల్దార్ సునీత సమక్షంలో ఘనంగా ప్రారంభించబడినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం మహిళలు మరియు బాలికలను సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడం. HPV వైరస్ కారణంగా వచ్చే వ్యాధులను ముందుగానే నివారించేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో ప్రయోజనకరమని డా. నవతా గారు తెలిపారు.
ఈ HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్యంగా 14-15 సంవత్సరాల బాలికలకు టీకా ఇవ్వబడుతున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి టీ.బి. ముక్త్ భారత్ అభియాన్ కింద టీబీ బాధితులకు పోషకాహార కిట్లు అందజేయడం జరిగింది. ఈ కిట్లు రోగుల ఆరోగ్య పునరుద్ధరణకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో CHO రాజేందర్ ప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ సునీత,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, స్టాఫ్ నర్స్ సరిత, కల్పన, ల్యాబ్ టెక్నీషియన్ సంపూర్ణ, ANMs మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
మండలంలోని అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమీప ఆరోగ్య కేంద్రాలలో HPV వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో నిరంతరంగా కొనసాగుతుందని డాక్టర్ నవత తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version