పైడిగుమ్మల్ లో మహిళా సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం…

పైడిగుమ్మల్ లో మహిళా సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. వార్డు సభ్యులు బందెల రెబుక ప్రశాంత్ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అండగా నిలుస్తున్నారని వారు తెలిపారు. భవన నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూస్తామని, త్వరగా పూర్తి చేసి మహిళా సంఘానికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version