గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మిక తనిఖీ..

గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మిక తనిఖీ

గ్యాస్ సరఫరాలో ప్రజలకు నిరంతర సేవలు

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఆయన వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.
ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్‌ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్‌ను సరఫరా చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు.
జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
ఈ తనిఖీ సందర్భంగా తనిఖీలో భాగంగా రోజువారీ బుకింగ్స్, డెలివరీస్, రీఫిల్ గ్యాస్ సరఫరా విధానాన్ని సమీక్షించారు. అదేవిధంగా జిల్లాలో గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

టిడిపి నేత జేబీ శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

అవ్వ, తాతల ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం…
ఇంటి ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన టిడిపి నేత జేబీ శ్రీనివాస్

తిరుపతి(నేటి ధాత్రి:

అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు చూడటమే టిడిపి కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నగరంలోని 5, 6, 7, 8, 9 డివిజన్లలో ఉదయం 6 గంటల నుండి రెండవ క్లస్టర్ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ పర్యటించి అర్హులైన వృద్దులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ళకు వెళ్లి జేబీ శ్రీనివాస్ పెన్షన్లను అందజేశారు. ఆయా డివిజన్ ల
లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను జేబీ శ్రీనివాస్ దృష్టికి తేవడంతో వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీ ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటికే 90% హామీలను నెరవేర్చడం జరిగిందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మూడు సిలిండర్ల గ్యాసు అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రఘురాం, ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version