హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

 హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

 

తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. CMO, లోక్ భవన్‌ను పేల్చేందుకు కుట్ర చేస్తున్నారని గవర్నర్ కార్యాలయానికి ఖాన్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ భవన్, సీఎంవోను వెంటనే ఖాళీ చేయించాలని మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్క్వాడ్‌‌తో సీఎంవో, లోక్ భవన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అలాగే, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version