అధైర్య పడకండి అండగా ఉంటా…..
మంత్రి సీతక్క సహకారంతో పేదలకు మేలు…
సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి…
మంగపేట:నేటిధాత్రి
ఆపన్న సమయంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతామని అధైర్య పడకండి అండగా ఉంటా అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇప్ప నరసింహారావు కుటుంబాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క సహకారంతో పేదల కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు మృతుని సతీమణి ఇప్ప ప్రమీల కు ప్రజా పాలనలో వితంతు పింఛన్ వెంటనే మంజూరు చేస్తామని అదేవిధంగా వికాస్ సంస్థలో పొందిన రుణం పై ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామని అంతేకాకుండా వివేక ఎఫ్పిఓ నుండి వ్యవసాయ సాగు కి అవసరమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం మృతుడు ఇప్ప నరసింహారావు సతీమణి ఇప్ప ప్రమీలకు తక్షణ సహాయం కింద రూ ఐదు వేల ఆర్థిక సహాయాన్ని నాసిరెడ్డి సాంబశివరెడ్డి అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ మోయునుద్దీన్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ధూళిపాల బాలకృష్ణ కటుకూరి శేషయ్య నాసిరెడ్డి నాగిరెడ్డి లక్కీ వెంకన్న యలగొండ లక్ష్మయ్య చెట్టిపల్లి రాజు రవి సాంబశివరావు నరసింహారావు చౌదరి మాల మహానాడు నాయకులు రాజమళ్ళ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు
