చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

వరంగల్ కేసీఆర్ సభను విజయవంతం చేయండి.గీత

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

వరంగల్లో జరిగే మహాసభకు మండల ప్రజలందరూ కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిన ఫలాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితుల పై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం కొరకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ సారధ్యంలో నిర్వహించబడునున్న మహాసభకు తరలిరావాలని, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, గీతా బాయ్ అన్నారు. ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చలో వరంగల్ గూడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే గూడ పత్రికను పలుచోట్ల గోడలకు అంటించిన అనంతరం, గీతా బాయ్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు, టిఆర్ఎస్ యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లాయర్ బిక్షపతి కి సన్మానం

బిఎస్.పి జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలంలోని రాఘవ రెడ్డి పేట గ్రామం దళిత బిడ్డ గోదా బిక్షపతి లాయర్ పట్టా తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రజా సంఘాలు నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా నిరుపేదలకు అండగా ఉండి న్యాయమైన సమస్యల పైన నిరంతరం పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పుల్ల మల్లయ్య ఎమ్మార్పీఎస్ టిజి రాష్ట్ర కార్యదర్శి శాస్త్రల తిరుపతి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా ఉపాధ్యక్షుడు మారపల్లి కొమురయ్య అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు అరకొండ రాజయ్య ఎమ్మార్పీఎస్ టిజి మండల అధ్యక్షులు రేణిగుంట్ల రాము పార్లపల్లి కుమార్ మాజీ ఉపసర్పంచ్ కొండ్ర సారయ్య పాల్గొన్నారు

న్యాయవాది గంధం శివపై పోలీసుల దాడి పట్ల నిరసన వ్యక్తం

నర్సంపేట కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట కోర్టులో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు.వరంగల్ కోర్టు న్యాయవాది గంధం శివపై పోలీసులు అకారణంగా దాడి చెసి కొట్టారని అట్టి పోలీసులను వెంటనే విడులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి,కార్యదర్శి శిలువేరు కిరణ్ కుమార్,ఏజిపి కోడిదెల సంజయ్ కుమార్,సీనియర్ న్యాయవాదులు తండ సారంగపాణి,తొగరు చెన్నారెడ్డి,దొంతి సాంబయ్య,మోటురి రవి,ఠాకూర్ సునీత,అంబటి రాజ్ కుమార్,జన్ను మహేందర్,కంసాని అశోక్,నాగుల రమేష్,కందకట్ల వీరేష్ తదితరులు ఉన్నారు.

పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు 

పరకాల నేటిధాత్రి..

హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్, చంద్రమోహన్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version