దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు వివాహ ప్రోత్సాహకం పట్ల హర్షం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం తో పాటుగా ఒక లక్ష రూపాయలు అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార జీవో ను అమలుచేసి దివ్యాంగులకు తీపి కబురు అందించడం పట్ల తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసీమ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .గత ప్రభుత్వ పాలనలో వికలాంగుల వివాహానికి సకలాంగులు వికలాంగులను వివాహమాడితే లక్ష రూపాయల వివాహ ప్రోత్సాహక పురస్కారం అందించేది.నేడు కాంగ్రెస్ ప్రజా పాలన లో సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పై దృష్టి సారించి సకలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే ఒక లక్ష రూపాయల అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార పథకంను మార్చేసి ఇద్దరు దివ్యాంగులు వివాహమాడిన కూడా దివ్యాంగులకు కల్యాణ లక్ష్మి పథకంతో పాటుగా వివాహ ప్రోత్సాహక పురస్కారం జీవో ప్రకారం ఒక లక్ష రూపాయలు వికలాంగులకు అమలుపరుస్తూ జీవో జారీ చేసిందన్నారు.ఇద్దరు దివ్యాంగుల వివాహానికి ఆర్థిక అండదండలుగా వివాహ ప్రోత్సాహక పురస్కారం తరపున ఒక లక్ష రూపాయలు దివ్యాంగులకు ఇచ్చి జీవో అమలుపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల ఆత్మ బంధువు అని మరోసారి నిరూపించుకున్నారన్నారు అన్నారు..